Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా అందరికంటే ముందున్నారు. కానీ, పర్సనల్ లైఫ్లో వెనకపడిపోయారు. వయసు 40 దాటి రెండేళ్లు అవుతున్నా ఈయన ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మరోవైపు ప్రభాస్ పెళ్లి వార్త వినాలని అభిమానులే కాదు తోటి సెలబ్రెటీలు సైతం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ శుభతరుణం రావడం లేదు.
అయితే తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లెందుకు కాలేదు అని ముఖం మీదే ప్రభాస్ను అడిగేసింది. అయితే రియల్గా కాదండోయ్.. రీల్గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్, పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వింటేజ్ ప్రేమ కథా చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతోంది.
అయితే ఎట్టకేలకు ఈ పాన్ ఇండియా మూవీని మార్చి 11న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా రాధేశ్యామ్ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. `మళ్ళీ లైఫ్ లో వాడి మొహం చూడను` అంటూ పూజా హెగ్డే చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ఈ గ్లింప్స్ విశేషకంగా ఆకట్టుకుంది.
పూజాను ముద్దు పెట్టుకోవడానికి, ప్రేమలో దింపడానికి ప్రభాస్ చేసే ప్రయత్నాలను ఈ గ్లిమ్స్ లో ఎంతో అందంగా చూపించారు. ఇక చివర్లో `కుక్ చేస్తావ్.. బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళెందుకు కాలేదు?` అంటూ పూజా హెగ్డే కూట్గా ప్రశ్నించడం.. దానికి ప్రభాస్ ఏం చెప్పాలో తెలీక అయోమయ స్థితిలో పడటం మరింత అలరిస్తోంది. మొత్తానికి తాజా గ్లింప్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్గా మారింది.