SSMB 28: టాలీవుడ్ లో గత నాలుగు సంవత్సరాల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు టైం గట్టిగా నడుస్తోంది. వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు రీసెంట్ గా సర్కారు వారి పాటతో… బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొడుతున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఇప్పుడు వస్తున్న ఈ మూడో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆల్ రెడీ ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాగా.. ఈ నెల ఆఖరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నందమూరి తారక రత్న కనిపించబోతున్నాట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదంతా పక్కన పెడితే మరో కీలకమైన పాత్రలో మహేష్ బాబు కోసం కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడని త్రివిక్రమ్ రంగంలోకి దింపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అనుటున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే సినిమాకి అత్యంత కీలకమైన పాత్ర కోసం కన్నడ సీనియర్ స్టార్ రవిచంద్రన్ ను త్రివిక్రమ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కన్నడలో ఆయనకి క్రేజీ స్టార్ అనే బిరుదు వుంది. తెలుగులో కూడా అప్పట్లో కొన్ని సినిమాలు చేయడం జరిగింది. అయితే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు రవిచంద్రన్ కి తన సినిమాలో త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.