(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తల వంచాల్సిందేనని టిడిపి యువనేత పరిటాల శ్రీరామ్ అన్నారు. అమరావతి ప్రాంతంలోని మందడం, వెలగపూడి గ్రామాల్లో రైతుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో అసెంబ్లీలో తమకు అనుకూలంగా బిల్లులు ఆమోదించుకునేందుకు పయత్నం చేస్తోందని విమర్శించారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అందరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. జై అమరావతి నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం వెలగపూడిలో మృతి చెందిన రైతు అప్పారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.