నేడు జరిగిన ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి వర్గ సమావేశంలో జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రైతు భరోసా మూడో విడత అమలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది విడత కు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ ఏడాదికి పన్నెండు వేలు చెల్లించగా ఇప్పుడు తీసుకున్న కొత్త నిర్ణయం ద్వారా 54 లక్షల 47 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది డిసెంబర్ 29వ తేదీన రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అన్నారు.
అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ని ఒక మాసంలోనే చెల్లించేలా మరో కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీరికి 719 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీకి ఆమోదం తెలిపారు. పశువు సంవర్ధక శాఖ లోని 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కూడా ఆమోదం లభించింది పులివెందులలోని ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు 83 కోట్లతో ఆనంద్ లోని ఇర్మా సంస్థ సహకారంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు.
ఇకపోతే ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది 16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం 16 వేల కోట్ల నిధుల సమీకరణ ఈ సంస్థ ద్వారా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అంతే కాకుండా రాష్ట్రంలో ఎప్పటినుండో నిర్వహించాలి అనుకుంటున్నా సమగ్ర భూ సర్వే కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్వే చట్టంలో ఐదు సవరణలను దీనిద్వారా ఆమోదించారు. ఇక తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీని కూడా ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.
ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేసే పరిశ్రమ ల పార్కు కు ఏర్పేడు లో పరిహారం చెల్లింపులకు ఆమోదం తెలిపారు. మార్చి నుండి కరోనా కారణంగా ఇబ్బందులు పడిన హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీ అమలు కు ఆమోదం తెలపడమే కాకుండా 50 వేల నుండి 15 లక్షల వరకు వారి సామర్థ్యాన్ని, నష్టాన్ని బట్టి రుణ సదుపాయం కల్పించాలని కూడా నిర్ణయించారు. కేవలం దీని కోసమే 198 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం.
అంతేకాకుండా ఆరు మాసాలు మారిటోరియం సదుపాయం ఉంటుంది కూడా ఉంటుందని తెలిపారు. వీటన్నింటితో పాటు పర్యాటక విధానానికి ఆమోదం తెలపడం విశేషం. పర్యాటక ప్రాజెక్టులకు పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఉంటాయని ఎస్ జిఎస్టి, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు కూడా ఉంటాయని చెప్పారు. సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్ ప్యాకేజీలు లభించాయి. ఎం ఎస్ ఎం ఎస్ గా పరిగణిస్తూ ఏప్రిల్, మే, జూన్ కాలానికి పవర్ ఫిక్స్డ్ చార్జీలను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపారు. 1100 సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీ పై సబ్సిడీ ఇచ్చేందుకు కూడా అనుమతించారు.
కేంద్రం ఇచ్చిన వెంటనే వ్యాక్సిన్ వేసేందుకు సిద్ధం కావాలని మాట అనుకున్న క్యాబినెట్ ముందుగా కరోనా వారియర్స్ కు, ఆ తర్వాత 50 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు, తర్వాత కోమార్బిడిటీ ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి పేర్ని నాని.