ఒక సామాజిక వర్గాన్ని జగన్ అణిచి పెడుతున్నారన్న అపవాదును పోగొట్టుకోడానికి వారికి త్వరలోనే ఆయన ‘కమ్మ’టి కబురు వినిపించబోతున్నారట.
బంతికి మరీ ఎక్కువగా గాలి ఊదితే అది పేరు పోయే ప్రమాదం ఉందని గ్రహించిన జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని కూడా దగ్గర చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే జగన్ కమ్మలకు బద్ధ విరోధి అన్నట్లు టిడిపి ప్రచారం సాగిస్తోంది. ఇది మరింతగా ఆ సామాజిక వర్గం లోకి వెళితే వారు అధికంగా ఉండే గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలలో వైసిపికి ప్రతికూలత ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది.ఆ జిల్లాల్లో దాదాపు అరవై దాకా అసెంబ్లీ సీట్లు ఉన్న విషయం ఇక్కడ గమనార్హం.వీటన్నిటి పరిగణలోకి తీసుకున్న జగన్ భవిష్యత్తులో కమ్మ సామాజికవర్గాన్ని దువ్వడానికి కొన్ని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇందులో భాగంగా కనీసం రెండు మంత్రి పదవులు లో కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వటానికి నిర్ణయించుకున్నారట ఇప్పుడు ఇప్పుడు కేవలం కొడాలి నాని మాత్రమే ఆ సామాజిక వర్గీయుడు జగన్ క్యాబినెట్ లో ఉన్నాడు.ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ,పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి వెంకట్రావు పేర్లను ఆయన పరిశీలిస్తున్నారని సమాచారం. అలాగే తనకు అత్యంత సన్నిహితుడైన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా సీఎం జగన్ గుడ్ లుక్స్ లో ఉన్నారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
పైగా జగన్ కి,వైసీపీకి బధ విరోధి అయిన చింతమనేని ప్రభాకర్ ని అబ్బయ్య చౌదరి ఓడించడం కూడా ఆయనకు పెద్ద ప్లస్పాయింట్.ఇక మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్కు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో పాటు విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిని చేసే ప్రతిపాదన జగన్ పరిశీలనలో ఉందట.అలాగే ప్రకాశం జిల్లాలో సీనియర్ నాయకుడు మాజీ శాసనసభ్యుడు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యను అద్దంకిలో వైసిపి నిలబెట్టబోతోంది.
పరుచూరు లో కూడా ఒక యువ ఎన్నారైని వైసిపి లైన్లో పెట్టిందట.చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ బాబు కూడా రేసులో ఉన్నప్పటికీ ఆయనకింకా స్పష్టమైన హామీ లభించలేదు.పర్చూరులో కనక ఎన్నారై వర్కౌట్ కాని పక్షంలో వెంకటేశ్ కి అక్కడ టిక్కెట్ ఇవ్వవచ్చు.రాజకీయం అంటేనే కులాల సర్దుబాటు .ఇందుకు జగన్ తో సహా ఎవరూ అతీతులు కారు.