(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైసిపి పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజుకు అధికారులపై కోపం వచ్చింది. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు గౌరవించకపోవడంతో డిడిఆర్సి సమావేశం నుండి ఆయన వాకౌట్ చేశారు.
మంత్రులు, కలెక్టర్, ఎస్పి వేదికపై కూర్చుని ఎంపిని కింది వరుసలో కూర్చోబెట్టడంపై రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశం నుండి వాకౌట్ చేశారు.
ఈ సందర్భంలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో డిడిఆర్సి సమావేశాల్లో ఎంపికి గౌరవమిస్తారని అన్నారు. ఇక్కడి పరిణామాలను తగు వేదికలో ప్రస్తావిస్తానని చెప్పారు. ఇకపై ఎంపిలకు తగిన గౌరవం దక్కేలా చూస్తానని ఆయన అన్నారు.