విజయవాడ: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు నిరసనగా విజయవాడ వన్టౌన్లోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంటి ఎదుట అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ధర్నా నిర్వహించారు. ‘ఒక రాష్ట్రం- ఒక రాజధాని’ నినాదంతో నిరసన చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించే వరకూ తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ హైప్ కోసమే విశాఖకు రాజధాని ప్రకటించారని ఆరోపించారు. అభివృద్ది వికేంద్రీకరణ కాదు.. అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణయం మార్చుకోకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.