అమరావతి: నన్ను భయపెట్టే వారు ఈ సభలో ఎవరూ లేరు, ఒక వేళ భయపెట్టినా భయపడను అని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. అసెంబ్లీలో మంగళవారం బడ్జెట్పై చర్చ జరుగుతున్న సందర్భంలో కాపు కార్పోరేషన్కు కేటాయించిన నిధులు తదితర అంశాలపై వైసిపి సభ్యుడు అంబటి రాంబాబు సుదీర్ఘంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించారు.
దీనిపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ చేయి పైకి ఎత్తి ఎంత సేపు ఎదురుచూసినా మాకు అవకాశం ఇవ్వడం లేదు అని వ్యాఖ్యానించారు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే సభకు వచ్చి ఉపయోగం ఏమిటి, బయటకు వెళ్లి మాట్లాడాలా, అయినా అవకాశం కల్పిస్తారని మీ దయ కోసం ఎదురుచూస్తున్నాం, ఎందుకో ఈ పక్క చూడటమే మానేశారు. ఇటు చూడాలంటే ఏమైనా భయపడుతున్నారా అంటూ స్పీకర్ను ఉద్దేశించి చంద్రబాబు ఛలోక్తి విసిరారు. దీనిపై స్పీకర్ కూడా నవ్వుతూనే తనకు బెదిరించే వారు సభలో ఎవరూ లేరనీ, తాను ఎవరికీ భయపడననీ వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?