అమరావతి: తన మర్యాదకు భంగం కలిగేలా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయసాయిరెడ్డి లోక్సభ స్పీకర్ ఓంభిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషిలకు ఫిర్యాదు చేయడంపై విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు.’ఈ గోలంతా ఎందుకు మన సాక్షి టివి, సాక్షి పేపరు మాత్రమే వుండేలా చట్టం చేయమంటే పోలా’ అంటూ కేశినేని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అఖిలపక్ష సమావేశంలో తనకు అవమానం జరిగినట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వార్తలు ప్రచురించాయనీ, నిరాధార వార్తలు వాసిన విలేఖరుల పార్లమెంట్ పాస్లు రద్దు చేయాలనీ విజయసాయిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేశినేని వ్యాఖ్యలపై విజయవాడ పార్లమెంటరీ వైసిపి ఇన్చార్జి, పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ స్పందించారు. ‘చట్టాలు చేయడానికి చట్ట సభలో నువ్వొకడివి. అదేదో నువ్వే చేసి పుణ్యం కట్టుకో. ఎలాగూ నీ బతుక్కి ఒక పెద్ద బిల్ ప్రవేశపెట్టింది లేదు, సచ్చింది లేదు. కావాలంటే నేను ఇంగ్లీషులో రాసి పెడతా నిశానీ దొర గారు!!’అంటూ పొట్లూరి ట్వీట్ చేశారు.