అమరావతి: రాజధాని రాష్ట్ర పరిధిలో అంశమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నైనా చంద్రబాబు కళ్లు తెరవాలని వైసీపీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాజధాని అంశంపై కేంద్రం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో అయన మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు భూముల కోసం ఉద్యమం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని రాజా విమర్శించారు.
చంద్రబాబులా సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ చూపించలేదని అన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. మండలిలో చంద్రబాబు గుంట నక్క మాదిరిగా గ్యాలరీలో కూర్చుని చైర్మన్ ను ప్రభావితం చేసారని రాజా విమర్శించారు.