అమరావతి: గ్రామ వాలంటీర్లకు అందజేయనున్న స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్ నిర్వహించడం వల్ల 83.80 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అయిందని ప్రభుత్వం ప్రకటించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించి విమర్శలు గుప్పించారు.
వినేవాళ్లు అమాయకులయితే చెప్పేవారు ఏమైనా చెబుతారు అన్నట్లుందని అన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడానికి నిధులు లేవని దొంగ ఏడుపులు ఏడుస్తున్న జగన్ గారు వైసిపి కార్యకర్తలకు సెల్ ఫోన్లు కొనడానికి 233 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని లోకేష్ ప్రశ్నించారు.
గ్రామ వాలంటీర్లు అని పేరు మార్చిన వైసిపి కార్యకర్తల కోసం జగన్మోహనరెడ్డి ఫోన్లు కొంటూ రివర్స్ టెండర్లో 83కోట్ల రూపాయల ఆదా అంటూ చెవిలో క్యాబేజీ పెట్టారని అన్నారు. వైసిపి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే రెండు సార్లూ ఒకే కంపెనీ టెండర్ వేసిందన్నారు. ఈ స్కీమ్లో 233 కోట్ల రూపాయల ప్రజాధనానికి జగన్ టెండర్ పెట్టడం తప్ప రివర్స్ టెండరింగ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.ఇకపోతే జగన్ పారదర్శకత ప్రకారం 100 కోట్ల రూపాయలు దాటిన టెండర్లకు జ్యూడిషయల్ ప్రివ్యూ జరగాల్సి ఉండగా మరి ఫోన్ల టెండర్లను ప్రివ్యూకు పంపలేదని ప్రశ్నించారు. ‘అంటే జే ట్యాక్స్ కడితే ప్రివ్యూ ఉండదా జగన్ గారు?’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?