NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics: వైసీపీ సూపర్ ప్లాన్.. అందుకే మళ్ళీ రాజధాని రాజకీయం..!?

ysrcp raised three capitals again

AP Politics: ఏపీ రాజకీయాలు AP Politics మళ్లీ మూడు రాజధానుల అంశం తెర మీదకు వచ్చింది. రెండు రోజుల క్రితం ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం ఖాయం. సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించొచ్చు. అన్నారు. దీనికి కొనసాగింపుగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ‘విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి తీరతాం. కోర్టు కేసులు పరిష్కరించుకుంటాం. ఈ ఏడాదని కాదు.. ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు ఉంటుంది. ఇందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. శాసనసభలో ఏ చట్టం చేశామో అది జరిగి తీరుతుంది’ అన్నారు. అయితే.. ఈ ప్రకటనలు అనేక అనుమానాలకు తావిస్తోంది.

ysrcp raised three capitals again
ysrcp raised three capitals again

ఇటివల ఏపీలో రాజకీయాలు బాగా హీటెక్కాయి. ముఖ్యంగా రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అంశం దేశవ్యప్తంగా చర్చల్లో నిలిచింది. ఆయన పుట్టినరోజు నాడే అరెస్టు దగ్గరి నుంచి సుప్రీంకోర్టు బెయిల్ వరకూ ఒక చోట.. ఒక విషయంపై మొదలైన టాపిక్ ఎన్నో మలుపులు తసుకుని మరెటో వెళ్లిపోయింది. ఆయన ఏపీ తీరుపై జాతీయ నాయకులను కలిసి ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. ఇవన్నీ సీఎం జగన్ కు చికాకు తెప్పించే అంశాలే. దీంతో వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. మూడు రాజధానుల అంశం తెర మీదకు తెచ్చారు. రాజధాని తరలింపు ఖాయం అన్నారు. ఇప్పుడే ఈ అంశంపై వీరిద్దరూ ఎందుకు మాట్లాడారన్నదే ఇప్పుడు ప్రశ్న. రఘురామ అంశాన్ని డైవర్ట్ చేసేందుకేనా? ప్రజల ఆలచనలు మళ్లించేందుకే ఈ ప్రకటన చేశారా? అనే అనుమానాలు వస్తున్నాయి.

Read More:Telangana Politics: రేవంత్ రెడ్డి బోనులోకి బీజేపీ.. టీఆరెస్..!?

నిజానికి ఈ విషయం ప్రస్తుతం అప్రస్తుతం. కరోనా కల్లోలంతో అల్లాడిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూడు రాజధానుల అంశాన్ని ప్రభుత్వమే టేకప్ చేయలేని అంశం. పైగా.. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో ఉన్న వేరే విషయాలపై అయితే.. ‘ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది.. ఇప్పుడే దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు’ అనే నాయకులు.. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై ఎలా ప్రకటన చేస్తున్నారనేదే ప్రశ్న. ఇవన్నీ ఆలోచిస్తే.. రఘురామ అంశం తమను డ్యామేజీ చేస్తుందనే భయంతో ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ఎత్తుగడ వేసి రాజధాని అంశాన్ని తెర మీదకు తెచ్చారని చెప్పాలి. లోగుట్టు ఇదేనా..? పాలకులే చెప్పాలి..!

 

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?