అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సచివాలయంలోకి తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశ వర్కర్ల వేతనాల పెంపు ఫైల్పై తొలి సంతకం చేశారు. ఉదయం 8.39గంటల ముహూర్తానికి సిఎం వైఎస్ జగన్ సచివాలయానికి చేరుకోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, డిజిపి గౌతమ్ సవాంగ్, ధనుంజయరెడ్డి తదితర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సిఎం ఛాంబర్లో పూజా కార్యక్రమాలు, పండిత ఆశీర్వచన కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశవర్కర్ల వేతనాల పెంపు, జర్నలిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఫైళ్లపై సంతకాలు చేశారు. అనంతరం సచివాలయ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సిఎం జగన్కు పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో తొలి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నందింగం సురేష్, ఆదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్రెడ్డి తదితరులు సిఎం జగన్కు అభినందనలు తెలిపారు.