అమరావతి: వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అధాకారులను ఆదేశించారు. గవర్నర్ హరిచందన్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
కాకినాడ జెఎన్టియు స్నాతకోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. అక్కడి చుట్టుపక్కల వరద పరిస్థితిని జిల్లా అధికారులు గవర్నర్కు వివరించారు. దీంతో ఆయన హెలికాఫ్టర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు.
ప్రకాశం బ్యారెజి నుండి ఎంత మేరకు నీటి విడుదల జరుగుతున్నదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నదని అధికారులు తెలియజేశారు.
భారీ వరద కారణంగా 18 మండలాలు ముంపుకు గురైనట్లు అధికారులు చెప్పారు. అధికారుల నుండి వివరాలు తెలుసుకున్న గవర్నర్ తక్షణం వరద బాధితులను ఆదుకోవాలని ఆదేశించారు.