హర్యానా : ‘భారత్ మాతాకి జై’ అని చెప్పలేనివారి ఓట్లకు విలువ లేదు అని టిక్ టాక్ స్టార్, ఆడంపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సోనాలి ఫోగాట్ అన్నారు. హర్యానాలో ప్రచారం నిర్వహిస్తున్న సోనాలి ఫోగాట్.. ‘భారత్ మాతాకి జై’ అనే నినాదం చేశారు. ఈ నినాదాన్ని గట్టిగా పలకలేనప్పుడు సిగ్గుపడాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అంతేకాదు అక్కడ గట్టిగా నినాదాన్ని పలకనివారితో.. ‘మీరంతా పాకిస్తాన్ నుంచి వచ్చారా? మీరు పాకిస్తానీలా? కాదు కదా? మీరు భారతీయులు అయితే భారత్ మాతాకి జై అని చెప్పండి’ అని వ్యాఖ్యానించారు.
అయినప్పటికీ ఎవరూ నినాదం పలకకపోవడంతో.. “భారత్ మాతాకి జై అని పలకలేనివాళ్లు సిగ్గు పడాలని, రాజకీయాల కోసం భారత్ మాతాకి జై అని చెప్పలేని వారి ఓట్లకు విలువ లేదు” అని ఆమె దెప్పి పొడిచారు. అక్టోబర్ 21న హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయిపై ఆమె ఆడంపూర్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి చరిత్ర సృష్టించారు స్మృతి ఇరానీ. అదే విధంగా తాను కూడా కల్దీప్ ను ఓడిస్తానని సోనాలి ఫోగాట్ ధీమా వ్యక్తం చేశారు.
"Those who can't say Bharat Mata Ki Jai their votes are of no value.I am ashamed of Indians like you"
Words from BJP's TikTok star candidate Sonali Phogat frm Haryana's Adampur.
Phogat has lakhs of TikTok followers & is challenging former CM Bhajanlal's son in his bastion@ndtv pic.twitter.com/omIXhRVr4u— Sukirti Dwivedi (@SukirtiDwivedi) October 8, 2019
టిక్టాక్ వీడియోలు చేసి సోనాలి ఫోగట్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. టిక్ టాక్ లో లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమెకు హర్యానాలో ఆడంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సోనాలి ఫోగాట్.. తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఆమె ఏ మాటలు మాట్లాడినా కూడా అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా హర్యానాలో ప్రచారం నిర్వహిస్తున్న సోనాలి ఫోగాట్ “భారత్ మాతా కి జై” అని చెప్పలేని వారి ఓట్లకు విలువ లేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు.