(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్పూర్లో ఉన్న ఓ చేతి పంపు నుంచి రక్తం, మాంసం ముద్దలు దారాగా వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ఆ చేతి పంపు నుంచి దుర్వాసన కూడా విపరీతంగా వస్తుండటంతో స్థానికులు భయపడిపోతున్నారు. ఖాజోడి గ్రామంలో మంచినీటికి తీవ్ర ఇబ్బంది ఉండేది. ఆ గ్రామంలో వంద నివాసాలు ఉంటాయి. ఇటీవలే గ్రామంలో తాగునీటిని కోసం ప్రభుత్వం బోరు వేయించి దానికి చేతి పంపు బిగించింది. అయితే, గత రెండు నెలలుగా ఆ హ్యాండ్ పంప్ నుంచి నీటికి బదులుగా రక్తమాంసాలు, ఎముకలు వస్తున్నాయి. ఇది చూసిన స్థానికులు భయపడిపోతున్నారు.
బోరు నుంచి రక్తం రావడాన్ని హమీర్పూర్ కలెక్టర్ దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. బోరును పరిశీలించిన అధికారులు.. లోపల రక్తం ఆనవాళ్లు లేవని తెలిపారు. హ్యాండ్ పంప్ లోపల పాము చనిపోయి ఉంటుందని అందుకే నీళ్లలో రక్తం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, గ్రామస్తులు ఆ బోరు వద్దకు వెళ్లేందుకు భయపడుతున్నారు.