న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంకు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఈడీ అరెస్ట్ నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న చిదంబరం పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈడీ తరుపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థాయం.. చిదంబరానికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో ఇప్పటికే సీబీఐ చిదంబరంను అరెస్ట్ చేసింది. గత 15 రోజులుగా చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉన్నారు. తాజాగా ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించడంతో ఈడీ కూడా ఆయనను అరెస్ట్ చేయనుంది. ఇదిఇలా ఉంటే ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడుల తరలింపుకు సహకరించారనే ఆరోపణలతో చిదంబరంను అగస్ట్ 21న సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
previous post
next post