(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తమ భూసమస్యకు పరిష్కారం చూపించకుంటే తాను పాన్ సింగ్ తోమర్ మాదిరిగా బందిపోటు అవుతానంటూ ఓ సిఆర్పిఎఫ్ జవాన్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్లో సిఆర్పిఎఫ్ జవానుగా పని చేస్తున్న ప్రమోద్ కుమార్ ఈ విధంగా మాట్లాడగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లో తన తల్లిదండ్రులకు సంబంధించిన భూముల్ని బంధువులే కబ్జా చేశారనీ, దీనిపై అధికారులకు విన్నవించినా అక్రమార్కులపై చర్యలు తీసుకోలేదని ప్రమోద్కుమార్ ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి 14 మంది నుండి ప్రాణహాని ఉందనీ, దీనిపై విచారణ జరిపించాలనీ ప్రమోద్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఈ విషయంలో కలుగజేసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని ప్రమోద్ కుమార్ కోరుతున్నాడు. లేదంటే సమాజంపై విరక్తి చెంది అరాచకాలకు పాల్పడుతున్న వాళ్లను అంతమొందించేందుకు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్న పాన్ సింగ్ తోమర్ మాదిరిగా తాను కూడా బందిపోటు అవుతానని ప్రమోద్ కుమార్ ప్రకటించారు.
వీడియో ఐబిసి 24 సౌజన్యంతో…..