(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒదిషా తీరం దాటిన తర్వాత సూపర్ సైక్లోన్ ఫోని బలహీనపడడం ప్రారంభమయిందని వాతావరణ శాఖ డైరక్టర్ జనరల్ కె.జె.రమేష్ తెలిపారు. ఒదిషా రాష్ట్రంలో ఈరోజంతా బలమైన గాలులు, భారీ వర్షం కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈశాన్య దిశగా ప్రయాణిస్తున్న ఫోనీ శనివారం సాయంత్రానికి బంగ్లాదేశ్లోకి ప్రవేశించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఫోనీ ప్రభావానికి భువనేశ్వర్లోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ భవనాలు బాగా దెబ్బతిన్నాయనీ, అయితే అక్కడ అందరూ సురక్షితంగానే ఉన్నారనీ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ తెలిపారు.
Video clip of a roof being blown off at the undergraduate hostel in AIIMS Bhubaneshwar due to #CycloneFani #Fani #FaniCyclone #FaniUpdates pic.twitter.com/97c5ELQJ46
— Jaideep Bhatnagar (@DG_PIB) May 3, 2019
భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థలో బలమైన గాలులకు ఒక కప్పు లేచిపోతున్న దృశ్యం:
ఒదిషా, బెంగాల్ రాష్ట్రాలలో తూర్పు రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్కతా విమానాశ్రయాలు మూసివేశారు. ఫలితంగా చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు.
పూరి జిల్లాలో ఫోని తీవ్రతను చూపుతూ పిఐబి మరో వీడియో ట్విట్టర్లో పోస్టు చేసింది:
The fiery #CycloneFani blows through Puripic.twitter.com/tf5VlwHoCu
— PIB India (@PIB_India) May 3, 2019
పూరి, ఖుర్దా, భువనేశ్వర్, జగత్సింగ్పూర్ జిల్లాలలో తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కటక్ నగరాన్ని ఫోని అతలాకుతలం చేసిందని ఆ నగర పోలీసు విభాగం ట్వీట్ చేసింది. నగరంలో చాలా వృక్షాలు నేలకొరిగాయి.
మధ్యాహ్నం తర్వాత ఫోని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు పి-81, డోర్నియర్ విమానాలు సిద్ధం చేస్తున్నట్లు నౌకాదళం ప్రకటించింది.