ఢిల్లీ, జనవరి 10: ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. యూత్ ఫర్ ఈక్విటీ అనే స్వచ్ఛంద సంస్ధ గురువారం అత్యున్నత న్యాయస్ధానంలో పిటిషన్ వేసింది. ఈ బిల్లు కారణంగా దేశంలో రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నాయనీ, ఇది రాజ్యాంగ విరుద్ధమనీ పిల్లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ సంతకం పెడితే బిల్లు చట్ట రూపం దాలుస్తుంది.
రిజ్వరేషన్ల వల్ల బ్రాహ్మణులు, రాజ్పుత్లు, జాట్లు, మరాఠాలు తదితర సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అమలు చేస్తున్న 49.5 శాతం రిజ్వరేషన్లకు ఇది అదనం. రెండు కలిపితే దేశంలో రిజర్వేషన్లు 59.05 శాతం అవుతాయి.
previous post
next post