లాహోర్(పాకిస్థాన్): పాకిస్థాన్లోని రెండవ అతి పెద్ద నగరమైన లాహోర్ బుధవారం భారీ పేలుడు సంభవించింది. 11వ శతాబ్ధానికి చెందిన సుఫీ ప్రార్థనా మందిరం దాతా దర్బార్ మహిళా భక్తుల ప్రవేశద్వారం వద్ద బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మృతి చెందగా, 24మందికిపైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ టెలివిజన్ వెల్లడించింది. దక్షిణ ఆసియాలోని అతి పెద్ద సూఫీ ప్రార్థనా మందిరం ఇది.
భద్రతా అధికారుల లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీస్ అధికారి మహమ్మద్ ఖషీఫ్ తెలిపారు. బాంబు పేలుడులో రెండు పోలీసు వాహనాలు దెబ్బతిన్నాయి.
ఈ ఘటనను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఖండించారు.
ఈ మందిరంపై 2010లో జరిగిన ఆత్మహుతిదాడిలో 40మందికిపైగా మృతి చెందారు.