అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ 69 పుట్టిన రోజును సొంత రాష్ట్రం గుజరాత్ లో జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఉదయం తన తల్లి హీరా బెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నర్మద జిల్లాలోని కేవాడియాకు వెళ్లారు. భారత ఉక్కుమనిషి సర్దార్ పల్లాబాయ్ పటేల్ కి చెందిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం జంగిల్ సఫారీ పార్క్, సర్దార్ సరోవర్ డ్యామ్ ను సందర్శించారు. కేవాడియా వెళ్లే మార్గంలో హెలికాప్టర్ నుంచే మోదీ.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని వీడియో తీశారు. 90 సెకన్ల ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. గుజరాత్లోని నర్మదా నదీతీరంలో 182 మీటర్ల ఎత్తైన సర్దార్ వల్లభ్భాయి పటేల్ ఐక్యతా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2018 అక్టోబర్ 31న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Reached Kevadia a short while ago.
Have a look at the majestic ‘Statue of Unity’, India’s tribute to the great Sardar Patel. pic.twitter.com/B8ciNFr4p7
— Narendra Modi (@narendramodi) September 17, 2019
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘నమామీ నర్మద’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2017లో సర్దార్ సరోవర్ డ్యామ్ ఆనకట్ట ఎత్తు పెంచిన తర్వాత ఆదివారం తొలిసారిగా నర్మదా నది మట్టం గరిష్ఠస్థాయికి చేరింది. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం నమామీ నర్మద కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని డ్యామ్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతోపాటు పలువురు పాల్గొన్నారు.
Prayers to Maa Narmada, for the peace and prosperity of our nation! pic.twitter.com/9cuHpUf2Rv
— PMO India (@PMOIndia) September 17, 2019