అమరావతి, మార్చి 29: ఐపిఎస్ అధికారుల బదిలీల వివాదంలో శుక్రవారం హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఎన్నికల సంఘం ఆదేశాలలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇంటెలిజెన్స్ డిజి ఎబి వెంకటేశ్వరరావు, కడప, శ్రీకాకుళం ఎస్పిల బదిలీలపై ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించిన విషయం విదితమే.
గురువారం సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది.
రాష్ట్రప్రభుత్వం కోరిన తాత్కాలిక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం కనబడడం లేదని జస్టిస్ ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల అమలు కొనసాగనున్నది.