ఢిల్లీ: ‘యువత కలలు నెరవేర్చడానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు తెలుగుభాషను ఆశ్రయించారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోది పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం మొట్టమొదటి సారిగా తెలుగు భాషలో తన వినతిని ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఈ రోజు మహబూబ్నగర్, కర్నూలులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నానని పేర్కొన్నారు. మహోన్నత ఎన్టిఆర్ ఆశయాలకు నీళ్లొదలి, మోసపూరిత తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అవినీతి, బలహీనమైన పాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉందని విమర్శించారు.
యువత కలలు నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు మోది విజ్ఞప్తి చేశారు.
భారత ప్రజలంతా ఎన్డిఎ మిత్రపక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో, ఆశీర్వదించాలో నేను మీకు వివరించదల్చుకున్నాను అని మోది తెలిపారు. ప్రజల సంక్షేమానికి ఎన్డిఎ ప్రభుత్వం నిర్వహించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించి చెప్పదల్చుకున్నాననీ, ప్రజలు బహిరంగ సభకు తరలిరావాలని మోది ఆహ్వానం పలికారు.
భారత ప్రజలంతా ఎన్డీయే మిత్ర పక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో, ఆశీర్వదించాలో నేను మీకు వివరించదలచుకున్నాను. @BJP4Telangana
— Narendra Modi (@narendramodi) March 29, 2019
ఈ సాయంత్రం నేను కర్నూలులో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను.
మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం పాలనలో ఆంధ్ర ప్రదేశ్ లో అవినీతి, బలహీనమైన పరిపాలనతో అన్ని రంగాలలో తిరోగమనంలో ఉంది.
యువత కలలు నెరవేర్చటానికి నేను ఆంధ్ర ప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను.
— Narendra Modi (@narendramodi) March 29, 2019