ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ భారతసేనలను ‘మోదీజీ సేన’గా అభివర్ణించడం ఆర్మీకి రుచించలేదని అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఎన్డిటివి పేర్కొన్నది. నిన్న ఘజియాబాద్లో ఎన్నిక ప్రచారసభలో ప్రసంగిస్తూ, ఆదిత్యనాధ్ పదేపదే ‘మోదీజీకి సేన’ అన్నారు.
‘కాంగ్రెస్ జనం టెరరిస్టులకు బిరియానీ తినిపిస్తారు. మోదీజీ సేనలు వారితో తుపాకీ గుళ్లు, బాంబులు తినిపిస్తారు. కాంగ్రెస్కు అసాధ్యం అయింది ప్రధాని మోదీకు సుసాధ్యం’ అని ఆదిత్యనాధ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ‘ఇది సైన్యాన్ని అవమానించడమే. వారు భారతసేనలు. ప్రచార మంత్రి ప్రయివేటు సేనలు కారు’ అని కాంగ్రెస్ ప్రతినిధి ప్రియాంకా చతుర్వేది ట్వీట్ చేశారు. ఆదిత్యనాధ్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Ab Indian Army ka naamkaran karke Modi ki Sena rakh diya CM Adityanath ne. This is an insult to our armed forces. They are India’s Armed Forces not the private army of Prachaar Mantri. Adityanath must apologise. https://t.co/IDF8U6DSjR
— Priyanka Chaturvedi?? (@priyankac19) April 1, 2019
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆదిత్యనాధ్ వ్యాఖ్యలను ఖండించారు.
We are proud of our Army. They belong to all. They are a great asset of our nation, and not a cassette of the BJP. People of this country must stand up and reject this statement. 2/2
— Mamata Banerjee (@MamataOfficial) April 1, 2019
ఆదిత్యనాధ్ వ్యాఖ్యలు తమకు కూడా అసంతృప్తి కలిగించాయని సైనికాధికార వర్గాలు తెలిపినట్లు ఎన్డిటివి పేర్కొన్నది. తమ అభ్యంతరాలను రక్షణ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు వారు తెలిపారు. పుల్వామా టెరరిస్టు దాడి, అనంతరం బాలాకోట్ శిబిరంపై భారత వైమానిక దాడి పరిణామాలను ప్రధాని మోదీ, ఆయన పార్టీ వారూ ఎన్నికల ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.