అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయిెంది. ఈ నెల 30 వ తేదీన మధ్యాహ్నం 12 గంచల 23 నిముషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇందుకు వేదికగా విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియాన్ని ఎంచుకున్నారు.
గవర్నర్తో భేటీ
శనివారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో వైసిపి శాసనసభాపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుండి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. జగన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలూ వెళ్లారు. గవర్నర్ నరసింహన్ను కలిసి వైసిపి శాసనసభాపక్ష నేతగా జగన్ను ఎన్నుకున్న తీర్మాన పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు.
జగన్ వెంట బొత్సా సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్ తదితరులు ఉన్నారు.
సాయంత్రం ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ను జగన్ కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నారు.
ఈ నెల 30న విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.