అమరావతి, మార్చి 19: జనసేన పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వివి (జెడి) లక్ష్మీనారాయణను ఖరారు చేసింది. మంగళవారం విశాఖ లోక్సభతో పాటు మరో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
శాసనసభ అభ్యర్థులు
విశాఖ ఉత్తరం పసుపులేటి ఉషారాణి
విశాఖ దక్షిణం గంపల గిరిధర్
విశాఖ తూర్పు కోన తాతారావు
భీమిలి పంచకర్ల సందీప్
అమలాపురం శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం తుమ్మల రామస్వామి(బాబు)
పోలవరం చిర్రి బాలరాజు
అనంతపురం టిసి వరుణ్
రాజగోపాల్కు పార్టీలో ఉన్నత పదవి
వివి లక్ష్మీనారాయణతో పాటు జనసేన పార్టీలో చేరిన ఆయన తోడల్లుడు, అనేక విశ్వవిద్యాలయాలకు ఉప కులపతిగా బాధ్యతలు నిర్వహించిన రాజగోపాల్ను పార్టీలో ఉన్నతమైన కమిటీకి చైర్మన్గా నియమించనున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన్నుఅనంతపురం పార్లమెంట్ స్థానం నుండి పోటీచేయమని కోరగా ఆయన శాసనసభ స్థానాన్ని టిసి వరుణ్కు కేటాయించడానికి సమ్మతించారనీ, పార్టీ బాధ్యతలపై మొగ్గు చూపారని తెలిపారు. పార్టీకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన రాజగోపాల్కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.