న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నియమితులయ్యారు. జస్టిస్ బాబ్డే నియామకంపై రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ మంగళవారం సంతకం చేశారు. సుప్రీం కోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ పదవీ కాలం నవంబర్ 17తో ముగియనుంది. నవంబర్ 18న బాబ్డే 47వ సిజెఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకూ జస్టిస్ బాబ్డే సిజెఐగా కొనసాగనున్నారు.
previous post