బెంగళూరు: కర్నాటక రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నెల18వ తేదీ గురువారం విధానసభలో విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్లు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. స్వయంగా కుమారస్వామి బలపరీక్షకు సిద్ధమవ్వడంతో నేడే విశ్వాసపరీక్ష పెట్టాలని బిజెపి పట్టుబట్టింది. అయితే దీనికి స్పీకర్ నిరాకరించారు.
ఎమ్మెల్యేల రాజీనామాలపై మంగళవారం సుప్రీం నుండి తీర్పు వెలువడనుందనీ, ఆ తరువాతే విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని స్పీకర్ రమేష్ కుమార్ వెల్లడించారు. ఈ విషయంపై సభలో గందళగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు.
కర్నాటక అసెంబ్లీలో మొత్తం 224మంది ఎమ్మెల్యేలు ఉండగా 16మంది రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు.
అసమ్మతి ఎమ్మెల్యేలు ముంబయిలోని హోటల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతల నుండి తమ భద్రతకు ముప్పు ఉందంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు ముంబయి పోలీసులకు లేఖ రాశారు. వారు తమని కలవకుండా చూడాలని లేఖలో కోరారు.
previous post
next post