బెంగళూరు: కర్నాటక శాసనసభ శుక్రవారానికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై ఉదయం నుంచీ చర్చ జరిగింది. తీర్మానంపై ఈ రోజే ఎంత రాత్రి అయినా వోటింగ్ జరగాలని బిజెపి పక్షనేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు.
అంతకు ముందు విశ్వాసపరీక్ష తీర్మానంపై ఈరోజే వోటింగ్ నిర్వహించాలంటూ స్పీకర్కు గవర్నర్ లేఖ రాశారు. స్పీకర్ ఆ లేఖను సభలో చదివి వినిపించారు. కాంగ్రెస్- జెడిఎస్ సంకీర్ణం కావాలనే జాప్యం చేస్తోందంటూ బిజెపి ఫిర్యాదు చేసిన వెంటనే గవర్నర్ విజూభాయ్ వాలా ఈ లేఖ రాశారు.
స్పీకర్ను ఆదేశించే అధికారం గవర్నర్కు లేదని కాంగ్రెస్ పేర్కొన్నది. వోటింగ్కోసం బిజెపి డిమాండ్, విప్పై స్పష్టత కోసం కాంగ్రెస్ డిమాండ్ సృష్టించిన గందరగోళం మధ్య స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. దీనితో బిజెపి సభ్యులు నిరసనగా సభలోనే భైటాయించారు.
(17:28 గంటలు) అంతకు ముందు:
బెంగళూరు: కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్న కర్నాటక శాసనసభలో గురువారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. విశ్వాసపరీక్ష తీర్మానంపై ఈరోజే వోటింగ్ నిర్వహించాలంటూ స్పీకర్కు గవర్నర్ లేఖ రాశారు. స్పీకర్ ఆ లేఖను సభలో చదివి వినిపించారు. స్పీకర్ను ఆదేశించే అధికారం గవర్నర్కు లేదని కాంగ్రెస్ పేర్కొన్నది. కాంగ్రెస్- జెడిఎస్ సంకీర్ణం కావాలనే జాప్యం చేస్తోందంటూ బిజెపి ఫిర్యాదు చేసిన వెంటనే గవర్నర్ విజూభాయ్ వాలా ఈ లేఖ రాశారు.
(16: 41 గంటలు) అంతకు ముందు:
బెంగళూరు: విప్ విషయంలో స్పష్టత పేరుతో విశ్వాసపరీక్షను వాయిదా వేయకుండా చూడాలని కోరుతూ బిజెపి గురువారం కర్నాటక గవర్నర్ విజూభాయ్ వాలాను కోరింది. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ నాయకత్వంలో కొందరు శాసనసభ్యుల బృందం వెళ్లి గవర్నర్ను కలిసింది.
అనంతరం తిరిగి వచ్చిన బిజెపి శాసననసభ్యులు వెంటనే విశ్వాసపరీక్ష తీర్మానాన్ని వోటింగ్కు పెట్టాలంటూ సభలో ధర్నాకు దిగారు. మరో పక్క కాంగ్రెస్ సభ్యుడు శ్రీమత్ పాటిల్ అదృశ్యంపై సభలో గంగరగోళం చేలరేగింది. కాంగ్రెస్ సభ్యులతో కలిసి రిసార్ట్లో ఉన్న పాటిల్ ఈరోజు ఉదయం మాయమైపోయి ముంబైలోని ఒక ఆసుపత్రిలో తేలారు. పాటిల్ను బిజెపి కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై సభలో గందరగోళం రేగడంతో స్పీకర్ సభను అరగంట సేపు వాయిదా వేశారు.