66వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ వేదికలో ఘనంగా జరిగింది. 2018 ఏడాదికిగానూ తెలుగు సినిమా `మహానటి`లో నటించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. చి.ల.సౌ చిత్రానికిగానూ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును అందుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఈ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. అవార్డు విజేతలకు ఈ నెల 29న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తేనీటి విందును ఇవ్వనున్నారు. అనారోగ్య కారణాలతో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడానికి తాను రాలేకపోతున్నానని అమితాబ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
previous post
next post