అమరావతి: ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలిపారు. సోమవారం కేవీపీ మీడియాతో మాట్లాడుతూ పార్టీ నిర్ణయం తప్ప తమకు స్వతంత్ర అభిప్రాయాలు ఉండవని తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై తమ పార్టీ నిర్ణయం శుక్రవారం(డిసెంబర్ 27) తర్వాతే వెలువరిస్తుందన్నారు. మూడు రాష్ట్రాల ప్రతిపాదనకు కాంగ్రెస్ మాజీ ఎంపీ, సినీ నటుడు చిరంజీవి తన సొంత అభిప్రాయం చెప్పారన్నారు. చిరంజీవికి వ్యక్తిగత స్వేచ్చతో ప్రకటన చేశారని, ఆయన అభిప్రాయం ఆయన ఇష్టమని పేర్కొన్నారు. జగన్ ప్రకటన చేసిన ఈ ఐదు, ఆరు రోజుల్లో మునిగిపోయింది ఏముంది ? అని ప్రశ్నించారు.
previous post