హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళి సై తో సినీ నటుడు చిరంజీవి మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెను పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాను నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విశేషాలను చిరంజీవి గవర్నర్ తమిళిసైతో పంచుకున్నారు. అంతేకాదు బ్రిటిష్ వాళ్లపై తొలి తిరుగుబాటు చేసినస్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘సైరా’ చిత్రాన్ని చూడమని కోరారు. దీనిపై తమిళ సై సానుకూలంగానే స్పందించారు. సైరా సినిమాని తప్పకుండా చూస్తానని చెప్పారు. చిరంజీవి తెలంగాణ గవర్నర్ను కలవడంపై రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గవర్నర్ను సైరా సినిమా విషయమై కలవడం వెనక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
Actor and Former Rajya Sabha member Sh. Chiranjeevi garu greeted and invited to watch his epic action film Sye Raa Narasimhareddy depicting the life of freedom fighter who fought against the British Raj pic.twitter.com/aE8NRldQ8J
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 5, 2019
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది. మరి గవర్నర్ ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని తెలుగు వెర్షన్లో చూస్తారా లేకపోతే.. తమిళంలో చూస్తారా అనేది చూడాలి.
Megastar Chiranjeevi garu met Telangana Governor @DrTamilisaiGuv garu as a courtesy call and to wish her for Dusshera. In their conversation, he asked to watch #SyeRaa and she expressed her willingness to do so. pic.twitter.com/VhOJXtRaq7
— Vamsi Kaka (@vamsikaka) October 5, 2019