న్యూఢిల్లీ: కశ్మీర్ను ఆక్రమించుకున్న దేశంగా భారత్ మిగిలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఆమె ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయాలు పెనువిపత్తుకు దారి తీస్తాయని ముప్తీ అన్నారు. భారత ప్రభుత్వం ఉద్దేశమేంటో ఇప్పుడు తేలిపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెట్టి కశ్మీర్ను లాక్కోవాలని చూస్తున్నారని ముఫ్తీ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భారత్ విఫలమయ్యిందని ఆమె విమర్శించారు.
‘భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఈ రోజు చీకటి దినం, 1947 నాటి సంప్రదాయాన్ని మంటగలిపారు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370రద్దు చేయడం రాజ్యంగ విరుద్ధం. కశ్మీర్కు ఇచ్చిన మాట తప్పారు. ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష నిర్ణయం’ అని ముఫ్తీ పేర్కొన్నారు.
It will have catastrophic consequences for the subcontinent. GOIs intentions are clear. They want the territory of J&K by terrorising it’s people. India has failed Kashmir in keeping its promises.
— Mehbooba Mufti (@MehboobaMufti) August 5, 2019