న్యూఢిల్లీ: కొద్ది గంటల్లో భారత ప్రధానిగా మోది రెండవ సారి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో కేంద్ర మంత్రి వర్గంలో తీసుకోనున్న నేతలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్యాబినెట్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.
మంత్రివర్గ కూర్పుపై మోది, అమిత్షాలు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.
నేటి రాత్రి ఏడు గంటలకు ప్రధాని మోదితో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న పార్లమెంట్ సభ్యులకు పిఎంఒ కార్యాలయం నుండి ఫోన్ చేసి సమాచారం అందజేశారు.
పిఎంఒ నుండి ఫోన్ సమాచారం అందుకున్న వారిలో అమిత్షా, రవిశంకర్ ప్రసాద్, పీయుష్ గోయల్, నిర్మలా సీతారామన్,. స్మృతి ఇరానీ, కిరణ్ రిజిజు సుష్మస్వరాజ్, రాజ్నాధ్ సింగ్, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, హర్షవర్థన్, ఎస్ జైశంకర్, రావ్ ఇంద్రజిత్ సింగ్, ఆర్జున్ రామ్ మెగ్వాల్, క్రిషన్ పాల్ గుర్జార్, శ్రీపాద్నాయక్, నరేంద్ర కుమార్ తోమర్, సురేష్ ప్రభు, వికె సింగ్, రామ్ విలాస్ పాశ్వాన్, హర్సిమ్రాట్ కౌర్, డివి సదానందగౌడ, బాబుల్ సుప్రియో, ప్రకాష్ జవదేకర్, రామ్దాస్ అత్వాలే, జితేందర్ సింగ్, నిరంజన్ జ్యోతి , పర్షోత్తం రూపాల, తవార్ చంద్ గెహ్లట్, రవీంద్ర నాధ్లతో పాటు తొలి సారి మంత్రివర్గంలో అడుగుపెట్టనున్న రతన్ లాల్ కటారియా, రమేష్ పక్రియాల్ నిషాంక్, ఆర్సిపి సింగ్, జి కృషన్ రెడ్డి, సురేష్ అంగాడి, కైలాష్ చౌదరి, ప్రహ్లద్ జోషి, సోమ్ప్రకాష్, రామేశ్వర్ టెలి, సుబ్రాత్ పాఠక్, డెబొశ్రీ చౌదరి, రిటా బహుగుణ జోషి ఉన్నారు.