విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వైసిపికి ప్రధాన ప్రత్యామ్నాయంగా అవతరించనుందని రాజ్యసభ సభ్యుడు సుజనచౌదరి పేర్కొన్నారు.
టిడిపి నుండి బిజెపిలో చేరిన తరువాత తొలిసారిగా ఆదివారం ఆయన రాష్ట్రంలో అడుగు పెట్టారు.
గన్నవరం విమానాశ్రయం వద్ద బిజెపి నేతలు, సన్నిహితులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపిలో చేరే ముందు వరకూ తాను పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోది ప్రణాళికలతో స్పూర్తి పొంది బిజెపిలో చేరినట్లు సుజనా చౌదరి తెలిపారు. ప్రధాని మోది కారణంగా అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యత పెరిగిందని సుజనచౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సుజన చౌదరి వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి ప్రత్యామ్నాయంగా భావించి పార్టీలో చేరినట్లు సుజన చౌదరి తెలిపారు.
గన్నవరం విమానాశ్రయం వద్ద సుజన చౌదరికి స్వాగతం వీడియో కొరకు కింద క్లిక్ చేయండి