తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమితులైన మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఎల్ -1,2,3 కేటగిరిల విఐపి దర్శనాలను రద్దు చేయాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలో జరగబోయే పాలమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సుబ్బారెడ్డి తెలిపారు.
శ్రీవారి దర్శనానికి విఐపిలు ఏడాదికి ఒక్క సారి మాత్రమే రావాలని సుబ్బారెడ్డి సూచిస్తున్నారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం తొందరగా కల్పించడంలో భాగంగా విఐపిలు ఏడాదికి ఒక సారి మాత్రమే ఆ ప్రోటోకాల్ అవకాశాన్ని వాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో పది రోజుల్లో టిటిడి పాలకమండలి డైరెక్టర్ల నియామకాన్ని పూర్తి చేయనున్నారని సుబ్బారెడ్డి తెలిపారు.