అమరావతి, మార్చి 18: సీనియర్ పార్లమెంట్ సభ్యుడు ఎస్పివై రెడ్టి టిడిపిని వీడారు. మూడు పర్యాయాల నుండి నంద్యాల పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్పివై రెడ్డి అభ్యర్ధిత్వం ఖరారు చేయడంలో టిడిపి అధినేత చంద్రబాబు ఇంత వరకూ ఎటూ తేల్చకపోవడంతో ఆయన మనస్ధాపానికి గురి అయ్యారు.
ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసినా నియోజకవర్గ ప్రజలు తనను ఆదరిస్తారని ఆయన స్పష్టం చేస్తూ తాను పార్లమెంట్కు, తన అల్లుడు, కుమారుడులు అసెంబ్లీకి స్వతంత్ర ఆభ్యర్ధులుగా పోటీ చేయనున్నామని సోమవారం మీడియాకు తెలిపారు.
ఎంఎల్సి ఇస్తామని చెబుతున్నారు, కానీ మాకు అవసరం లేదన్నారు.
అవినీతి చేయడం చిటికెలో పని, నిజాయితీగా బ్రతకడమే నేడు కష్టమని అన్న ఎన్పివై రెడ్డి నిజాయితీగా బ్రతుకుతున్న ఎంపిల్లో తాను ఒకడినని సగర్వంగా తెలిపారు.
పారిశ్రామిక వేత్త అయిన ఎస్పివై రెడ్డి వరుసగా మూడు సార్లు నంద్యాల పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయి హాట్రిక్ సాధించారు. 2014లో వైసిపి నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయిన ఎస్పివై రెడ్డి పలు కారణాల వల్ల ఆ పార్టీని విభేదించి టిడిపిలో చేరారు.