విజయవాడ, మార్చి 18: రాజకీయాల్లో ఉన్న నాయకులు విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారవుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశ్వసనీయత లేని వ్యక్తులు పాలకులు అయితే పరిస్థితులు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని పవన్ అన్నారు.
విజయవాడ పార్టీ కార్యాలయంలో సోమవారం పాలకొల్లు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త గుణ్ణం నాగబాబు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
దశాబ్దాలుగా పడిన కష్టం ఫలితా లు ఇవ్వని పరిస్థితి లో నాగబాబు పడుతున్న బాధ ఆయనపై పోటీ చేయాల్సిన నాయకులను సైతం కదిలించిం దని అన్నారు. జనసేన పార్టీ బలపడాలి అన్న ఏకైక లక్ష్యంతో స్థానిక జనసేన సైనికులు మా అందరికంటే నాగబాబు అయితే గెలుపు ఖాయం అని ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచిన అందుకు జన సైనికులకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలో అరుదుగా జరుగుతుంటాయని పవన్ అన్నారు. దశాబ్దాలుగా చేసిన శ్రమను వారు గుర్తించరేమో కానీ జనసేన పార్టీ గుర్తిస్తుందని పవన్ పేర్కొన్నారు. జనసేన పార్టీ పాలకొల్లులో ఘన విజయం సాధించారని పవన్ ఆకాంక్షించారు.
పాలకొల్లు మా కుటుంబానికి హృదయానికి దగ్గరగా ఉన్న ప్రదేశం, పాలకొల్లు లోనే తాను ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ దీర్ఘకాల లక్ష్యాలతో బలమైన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. దెబ్బకు దెబ్బ బలంగా కొడదామని పవన్ పేర్కొన్నారు.
నాగబాబు తోపాటు పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన పలువురు జెడ్ పి టి సి లు ఎంపిటిసిలు కౌన్సిలర్లు వందలాది మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.
ముమ్మడివరం వైసిపి సమన్వయకర్త పితాని బాలకృష్ణ సైతం ఇటీవల జనసేన పార్టీలో చేరారు. జగన్ టికెట్ ఖరారు చేస్తానని హామీ ఇవ్వడంతో ఎనిమిదేళ్ల ప్రభుత్వ సర్వీసును వదులుకొని పితాని వైసీపీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో పితాని జనసేన లో చేరగా తొలి అభ్యర్థిగా బాలకృష్ణను పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.