(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తమ దేశం మొదటగా అణ్యాయుధాన్ని భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించబోదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ దేశ మంత్రులు పూటకో మాట మాట్లాడుతూ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా లాహోర్ లోని సిక్కులకు సంభందించిన కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ అణుయుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘ఇరు దేశాలూ ఆణ్యాయుధాలు కలిగి ఉన్నవే.భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. భారత్ తో అణుయుద్ధానికి సిద్ధమేనని ఇమ్రాన్ ఖాన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Pakistan PM Imran Khan says Pakistan will not use nuclear weapons first amid tensions with India: Reuters pic.twitter.com/0JfFqKUI0r
— ANI (@ANI) September 2, 2019