న్యూఢిల్లీ, అమెరికా పర్యటనకు వెళ్లే ప్రధాని నరేంద్ర మోదీ తమ గగనతలంలో పయనించడానికి వీల్లేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది. మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన వారం రోజుల పాటు అక్కడ ఉంటారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో బాలాకోట్ ప్రాంతంలోని టెరరిస్టు శిబిరాలపై భారత వాయుసేన ఫిబ్రవరి 26న మెరుపు దాడులు చేసిన తర్వాత ఇండియా తమ గగనతలం వాడుకునేందుకు వీల్లేదని పాకిస్తాన్ ప్రకటించింది. తర్వాత జూలైలో మళ్లీ అనుమతించింది. అయితే ఇటీవల రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో కూడా పాకిస్థాన్ తమ గగనతలం ఇవ్వలేదు. తాజాగా ప్రధాని మోదీ విమానానికి గగనతలం ఇచ్చేది లేదని పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ ప్రకటించినట్లు ఎఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.