ఖతీబ్ హుస్సేన్ అనే సదరు విద్యార్థిపై హత్యానేరం మోపినట్లు పోలీసులు తెలిపారు. పార్టీ రిహార్సల్ కు హాజరైన ఇతర విద్యార్థులు వెంటనే ఖతీబ్ ను నేలపై పడుకోబెట్టి చేతులు వెనక్కి పట్టుకున్నారు. కానీ, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫ్రొఫెసర్ అక్కడ మరణించారని కాలేజి ప్రిన్సిపాల్ వలీ ముహమ్మద్ తెలిపారు. ఎగర్టన్ కాలేజిలో విద్యార్థుల కంటే విద్యార్థినుల సంఖ్య ఎక్కువ. 2వేల మంది అబ్బాయిలుంటే 4 వేల మంది అమ్మాయిలు అక్కడ చదువుతారు. మరణించిన ప్రొఫెసర్ మరో నాలుగు నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది.
పాకిస్థాన్ లో ముస్లిం సంప్రదాయాలను చాలా కఠినంగా పాటిస్తారు. మహిళల హక్కులను ముస్లిమేతర అలవాట్లుగా అభివర్ణిస్తారు. తరగతులకు హాజరు కాలేదని విద్యార్థిని గట్టిగా అడిగినందుకు ఓ స్కూలు ప్రిన్సిపాల్ ను గత సంవత్సరం కాల్చి చంపేశారు. ఈ నెలలోనే మహిళలు ఒక ర్యాలీ నిర్వహించగా ఛాందసవాదులు దాన్ని విమర్శించి, నిర్వాహకులను రేప్ చేసి చంపేస్తామని బెదిరించారు. లైంగిక దాడి, విడాకుల లాంటి విషయాలను బహిరంగంగా చర్చించడం, మగవారిని ఇంటి పని చేయాలని చెప్పడం సరికాదని అన్నారు. మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్ ఆరో స్థానంలో ఉంది.