ఉద్ధంపూర్ (జమ్ముకాశ్మీర్): జమ్ము కాశ్మీర్లో ఒక సిఆర్పిఎఫ్ జవాన్ తన సర్వీస్ రైఫిల్తో ముగ్గురు సహచరులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ జవాన్ అజిత్ కుమార్ తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ ఘటన జమ్ము కాశ్మీర్ ఉద్దంపూర్లోని 187 బెటాలియన్ క్యాంపులో జరిగింది.
ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన పొకర్మాల్, ఢిల్లికి చెందిన యోగేంద్రశర్మ, హరియాణాకు చెందిన ఉమెద్ సింగ్లు మృతి చెందారు.