బిఙెపితో తనకు వ్యక్తిగత శతృత్వం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ బిజెపి అగ్రనేత రామ్మాధవ్తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిందనీ పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని తాను కోరినట్టు వవన్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ ప్రాంత ప్రజల్లో బలమైన కోరిక ఉందనీ ఆ కోరిక మేరకు ప్రజలు తెలంగాణ సాధించుకొన్నారని ఆయన ప్రస్తావించారు. అయితే ప్రత్యేక హోదా అనేది కూడా తెలంగాణ సాధన మాదిరిగానే ఏపీ ప్రజల్లో కోరిక ఉందా లేదా అనేది తేలాలని పవన్ అన్నారు. ఒకవేళ ప్రజల్లో ఆ కోరిక ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యపై పోరాటం చేయాల్సిందేనని పవన్ స్పష్టం చేశారు.
పాత పరిచయంతోనే తాను రామ్ మాధవ్ను కలిసినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. పనిచేయడమే తన చేతుల్లో ఉందనీ, ఫలితాలు తన చేతుల్లో లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు.