పుదుచ్చేరి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పుదుచ్చేరిలో కాంగ్రెస్ నాయకులు ఉల్లిపాయలను కానుకగా ఇచ్చారు. సోమవారం(డిసెంబర్ 9) సోనియా 73వ జన్మదిన వేడుకలు పుదుచ్చేరిలో ఘనంగా జరిగాయి. పుదుచ్చేరి సీఎం వి. నారాయణస్వామి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కిలో ఉల్లిపాయలను కానుకగా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉల్లిపాయలను తీసుకున్నారు.
Puducherry Chief Minister V. Narayanasamy gifted 1 kg of onion each to party workers today, on the occasion Congress interim President Sonia Gandhi's birthday. pic.twitter.com/mbzi6xCfLo
— ANI (@ANI) December 9, 2019
దేశంలో ఉల్లిపాయల కొరత తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఆకాల వర్షాల వల్ల ఉల్లి దిగుబడి తగ్గడంతో నెల రోజులుగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో ఉల్లిపాయల ధర రూ. 150పైనే పలుకుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో గరిష్టంగా రూ.180 రూపాయలకు చేరినట్లు సమాచారం. ఇటీవల మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాధారణ స్థాయి కంటే ఉల్లి దిగుబడులు తగ్గిపోవడంతో ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉల్లి అందుబాటులో లేకపోవడంతో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.