టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్లో ఒకడైన పూరి జగన్నాథ్.. ప్రధాని నరేంద్ర మోదీకి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చేస్తున్న పనులకు సంబంధించి కొన్ని సూచనలు చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు పూరి. ఇందులో చాలా సమస్యలతో పోల్చుకుంటే సింగిల్ యూజ్ ప్లాసిక్ సమస్య అంత పెద్ద సమస్య కాదని పూరి అభిప్రాయపడ్డారు.
“ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాతావరణ మార్పు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ప్లాస్టిక్ వాడకం కూడా ఒకటి. కేవలం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తే పర్యావరణం బాగుపడదు. ఆ ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్లే అది పర్యావరణానికి హానికరంగా మారుతుంది.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే దాని స్థానంలో ఎకో ఫ్రెండ్లీ బ్యాగులను తయారు చేయాలి. దాని వల్ల చెట్లు నాశనం అవుతాయి. దీని వల్ల పర్యావరణం పాడవుతుంది. ప్లాస్టిక్ వాడకం కంటే వాహనాల నుండి వచ్చే కాలుష్యమే ప్రమాదకరం. ముందు దాన్ని నాటండి. ఎక్కువగా మొక్కలు నాటాలి. ఒకసారి వాడిన ప్లాస్టిక్ను మళ్లీ మళ్లీ వాడేలా చూడాలి. ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ రీస్లైకింగ్ క్రేందాలను పెట్టి ప్లాస్టిక్ను తీసుకొచ్చి ఇస్తే డబ్బులు ఇస్తామని చెబితే ప్రజులు ప్లాస్టిక్ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, తీసుకొచ్చి ఆయా కేంద్రాల్లో ఇస్తారు. ఇలా చేస్తే ప్లాస్టిక్ బారి నుండి పర్యావరణాన్ని కాస్త కాపాడుకోవచ్చు“ అన్నారు.
Dear Hon'ble Prime Minister Shri @narendramodi ji
IS SINGLE USE PLASTIC REALLY A PROBLEM? pic.twitter.com/sf6A6WMA45
— PURIJAGAN (@purijagan) October 20, 2019