ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్యకేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో రోహిత్ భార్య అపూర్వ శుక్లానే నిందితురాలిగా అనుమానిస్తోన్న పోలీసులు, ఆమెను అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత, రోహిత్ ముఖంపై తానే దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి అపూర్వే చంపిందని పోలీసులు అంటున్నారు. తొలుత కార్డియాక్ అరెస్టు కారణంగా మరణించినట్లు భావించినా, తర్వాత హత్య అని తేలింది. ఈ హత్య తానే చేశానని ఆమె చెప్పినట్టు సీనియర్ పోలీసు అధికారి రాజీవ్ రంజన్ చెప్పారు. ఆ సమయంలో అతడు తాగేసి ఉండటంతో ఎదురు తిరగలేకపోయినట్లు తెలిపారు.
మద్యం మత్తులో తూలుతూ వచ్చిన రోహిత్ను హత్యచేయడానికి ఇదే సరైన సమయమని అపూర్వ భావించింది. ఆయన తన గదిలో నిద్రపోతుండగా దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసిందని, దీనికి చెఫ్ అఖిలేశ్, పని మనిషి గోలు సాయం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఈ హత్య కేసులో నిందితుల పాత్రపై ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు. హత్య జరిగిన ఢిల్లీ డిఫెన్స్ కాలనీ భవనం మొదటి అంతస్తులోని సీసీటీవీ ఫుటేజ్లో ముగ్గురు నిందితులు రోహిత్ గదిలోకి వెళ్లినట్టు రూఢి అయ్యిందని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో హత్య జరగ్గా, తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసిందని, ఇదంతా గంటన్నరలో అయిపోయిందని అన్నారు.
ఉత్తరాఖండ్కు వెళ్లిన రోహిత్ ఏప్రిల్ 15 అంటే చనిపోయే ముందు రోజు ఢిల్లీకి వచ్చారు. అర్ధరాత్రి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికొచ్చినట్టు ఆయన నివాసం వద్ద సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. బంధువైన ఒక మహిళతో కలిసి రోహిత్ దారి మొత్తం తాగుతూనే ఉన్నాడని పోలీసులు అన్నారు. అతడికి నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉండటంతో ఉదయం ఎవరూ అతడిని లేపేందుకు ప్రయత్నించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఎవరో గదిలోకి వెళ్లేసరికి స్పృహ తప్పి ఉండటంతో పాటు ముక్కులోంచి రక్తం కారుతోంది. ఆ సమయానికి మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉజ్వలా తివారీకి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. దాంతో ఆమె అంబులెన్సు తీసుకుని రోహిత్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మద్యం మత్తులో తూలుతూ వచ్చిన రోహిత్ను హత్యచేయడానికి ఇదే సరైన సమయమని అపూర్వ భావించింది. ఆయన తన గదిలో నిద్రపోతుండగా దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసిందని, దీనికి చెఫ్ అఖిలేశ్, పని మనిషి గోలు సాయం తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఈ హత్య కేసులో నిందితుల పాత్రపై ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు. హత్య జరిగిన ఢిల్లీ డిఫెన్స్ కాలనీ భవనం మొదటి అంతస్తులోని సీసీటీవీ ఫుటేజ్లో ముగ్గురు నిందితులు రోహిత్ గదిలోకి వెళ్లినట్టు రూఢి అయ్యిందని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. తమ ఆస్తిని సొంతం చేసుకోవాలని అపూర్వ, ఆమె కుటుంబం నిరంతరం ప్రయత్నిస్తోందని రోహిత్ తల్లి ఉజ్వల పలుమార్లు ఆరోపించారు.