న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్కు రక్షణ మంత్రిత్వశాఖ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీలో స్థానం కల్పించారు. మొత్తం 21 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీకి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. 2008 మాలేగావ్ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితురాలిగా ఉన్న ప్రగ్యా.. 2019 మే లోక్సభ ఎన్నికల ప్రచారంలో మరో వివాదం సృష్టించారు. నాథురామ్ గాడ్సేను దేశభక్తుడుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ జోక్యంతో తరువాత ఆమె తన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు. గత లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రగ్యా సింగ్ ఠాకూర్… కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ను ఓడించి ఎంపీగా గెలుపొందారు.
మరోవైపు రక్షణ రంగానికి చెందిన పార్లమెంటరీ కమిటీలో సాధ్వికి చోటు కల్పించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ‘‘తీవ్రవాద కార్యకలాపాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న, గాడ్సేను పొగిడిన వ్యక్తిని పార్లమెంటు కమిటీలో నియమించడమంటే భద్రతా బలగాలను అవమానపరచడమే. అంతేకాకుండా ప్రతీ భారతీయుడ్ని అవమానించడమే’’ అని ట్విట్టర్ లో పేర్కొంది. రక్షణ శాఖ కమిటీలో ప్రగ్యా సింగ్ ఎంపికను కాంగ్రస్ పార్టీ తప్పుబట్టింది. ప్రగ్యా నియామకం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఆమె ఎంపికపై మరోసారి పునరాలోచించాలని బీజేపీని కాంగ్రెస్ కార్యదర్శి ప్రణవ్ ఝా కోరారు.
Pragya Thakur, a terror accused & Godse fanatic has been nominated by the BJP govt. to be a member of the Parliamentary Panel on Defence. This move is an insult to our nation's defence forces, to our nation's esteemed parliamentarians & to every Indian. https://t.co/OqX4wGA4Dk
— Congress (@INCIndia) November 21, 2019