అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు డైరెక్టర్ల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. బోర్డు డైరెక్టర్ల నియామకానికి సంబంధించి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
జూన్ 22వ తేదీన వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్గా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి రెండు మాసాలు దాటినప్పటికీ పాలకమండలి సభ్యుల నియామకం జరగకపోవడంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొన్నది.
టిటిడి బోర్డులో చోటు కోసం నేతల నుండి పోటీ ఎక్కువగా ఉండటంతో డైరెక్టర్ల ఎంపిక ఆలస్యమవుతోందని భావిస్తున్నారు. సిఎంతో టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి నేడు ప్రత్యేకంగా భేటీ కావడంతో డైరెక్టర్ల ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో నియామకాలు పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా టిటిడి పాలకమండలిలో తెలంగాణ కోటాలో చోటు కోసం పలువురు నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్తో తెలంగాణ సిఎం కెసిఆర్కు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ద్వారా టిటిడి బోర్డులో చోటు దక్కించుకునేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, మైహోం గ్రూప్ అధినేత రామేశ్వరరావులతో పాటు ఒకరిద్దరు టిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు కూడా టిటిడి డైరెక్టర్ పదవులను ఆశిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.