కడప, మార్చి 22: వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పులివెందుల అభ్యర్థిగా శుక్రవారం మధ్యాహ్నం 1.49గంటల ముహూర్తానికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పండిత ఆశీర్వచనాలు అందుకున్నారు.
పులివెందుల తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి జగన్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.
నామినేషన్ కార్యక్రమానికి ముందు సిఎస్ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, మోసాలు ప్రజలు అర్థం చేసుకోవాలని, వైసిపి అధికారంలోకి వస్తే సువర్ణపాలన అందిస్తానని హామీ ఇచ్చారు.